Pages

వాసంత సమీరంలా నులివెచ్చని గ్రీష్మం లా సారంగ సరాగం లా అరవిచ్చిన లాస్యం లా.......ఒక శ్రావణ మేఘం లా.......ఒక శ్రావణ మేఘం లా ...శరత్చంద్రికల కలలా.....హేమంత తుషారం లా నవ శిశిర తరంగం లా..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ..కాలం జాలం లయలో కలల అలల సవ్వడి లో ....సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

Tuesday, December 13, 2011

అల్లుడుగారు ...అత్తారిల్ల్లు


రాజేష్ పుట్టి పెరగడం అంతా పట్నం లోనే కావడం వల్ల ఏరి కోరి పల్లెటూరి లోనే పుట్టి పెరిగిన రజని ని  చేసుకున్నాడు .అత్తగారు వాళ్ళు పెద్ద (సంక్రాంతి) పండగకి పిలిచారు .
పల్లెకు పోదాం ...ఊరులు చూద్దాం చలో చలో
ఎంజోయ్ చేదాం చలో చలో....పొద్దువాలే ముందుగానే ముంగిటవాలేనో  ,అనుకుంటూ అత్తారింటికి ఆనందంగా బయలుదేరాడు.ముందురోజు పొద్దునే ఎక్కిన మనిషి "direct బస్సు లేక నానా అగచాట్లు పడుతూ,తర్వాతి రోజు పొద్దువాలిన తర్వాత  అత్తారింటికి చే్రుకున్నాడు .రాత్రి భోజనాలు చేసి పడుకునే ముందే రజని తో చెప్పాడు నేను లేచేవరకు నన్ను ఎవ్వరు లేపడానికి వీల్లేదు  అని .

తెల్లవారింది భోగి పండుగ హడావుడి మొదలయింది ,లీలగా ఎక్కడనుంచో హరినామ సంకీర్తం వినిపించి రాజేష్ కి మెలకువ వచ్చింది "time చూస్తే ఉదయం 6 గం|| .బద్దకంగా ఒళ్ళు విర్చుకుంటూ బయటకి వచ్చాడు.అరే విచిత్రంగా ఉందే ఎప్పుడూ లేనిది ఏంటి ఇంత పొద్దునే లేచారు అంటూ ఎదురొచ్చింది రజని ,ఏమోనోయ్ నిద్రరావటం లేదు అందుకే లేచేసా
సర్లే కాని కాఫీ ...అని నసిగాడు !!!, 
ముందే చెప్పాగా మా ఇంట్లో బెడ్ కాఫీ నిషేధం .మా అమ్మ చచ్చినా ఇవ్వదు....
మాట పూర్తయ్యే లోగానే అమ్ములూ ఇలా రావే అంటూ  తల్లి పిలుపు వినిపించింది .తల్లి.. చేతిలో కాఫీ గ్లాసు పట్టుకుని కూతురి చేతికిచ్చి అల్లుడుగారికిచ్చిరా అంది, రజనికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది 
.అదేంటమ్మా నువ్వూ....అంటూ ఆగిపోయింది ,
నోరుమూసుకుని చెప్పిన పని చేయ్  ఆరాలు తీయకు అని మడి సరిచేసుకుంటూ మళ్ళీ రాముడి ని స్మరిస్త్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది .వెనకనుంచి  కిసుక్కున నవ్వు వినపడింది చూస్తే తమ్ముడు నవ్వుతూ నిలబడ్డాడు .
అక్కోయ్ అల్లుడి మర్యాదలంటే ఇవేనేమోనే , మన బావే మన ఇంటికి మొదటి అల్లుడు కదా అందులోను దూరపు సంబంధం కదా ,అందులోను పట్నం అల్లుడు


నాన్న సంగతే తీసుకో ఒరేయ్ సూరిగా, ఒరేయ్ తమ్ముడూ అంటూ అమ్మమ్మ నాన్న కే ఎదురు పనులు చెప్తూ ఉంటుంది,మన బాబాయ్ లు అందరిది కూడా ఇంచుమించు అదే పరిస్థితి మన  అత్తలు అందరూ కలిసి వాళ్ళని ఆడేసుకుంటూ ఉంటారు . మనవాళ్ళని పిన్ని అని పిలవాలో వదినా అని పిలవాలో వరుసలతో సతమత మై పొతున్నా అనుకో  :(. ........
కాఫీ చల్లారపోయేలా ఉంది ముందు అది ఇచ్చి తర్వాత అక్క తమ్ముళ్ళు తీరికగా బాధ పడుదురుగాని ,మళ్ళీ తల్లి కేకలేసింది .

కాఫీ తీసుకుని పెరట్లో అరుగు మీద కూర్చున్నాడు ,అక్కడ పిన మావగారు పనస పొట్టు కొడుతున్నాడు  ,మధ్యలో వదినా కాఫీ అని అరుస్తున్నాడు .పాపం ముఖం కడుక్కుని గంటైనా కాఫీ లేక అల్లాడుతున్నాడు.ఇంతలో రాజేష్ కాఫీ తాగడం అయ్యింది ,తనుకూడా పనసపొట్టు కొడతానని బ్రతిమాలి చేతిలోంచి లాక్కునంత పనిచేసి నెమ్మదిగా కొట్టడం మొదలు పెట్టాడు
చూసావా ఆఖరికి మీ నాన్న కూడా ఏం చేస్తున్నాడో పక్కనున్న రాగిణి  నెత్తి మీద మొట్టి అన్నాడు సదరు పెద్ద బామ్మర్ది శ్రీరాం .
ఏం చేసాడేం అంది రాగిణి ,ఇంకా ఏం చేయాలి ఎన్ని సార్లు అడిగానో నేను ఒక్కసారి పనస పొట్టు సరదాగా కొడతా అని,  ఇచ్చాడా పైగా చిన్నోడివి నీకేం రాదు అవతలికి ఫో అన్నాడు  X-/, నేనేం చిన్నా వాడినా చితక వాడినా ...మహా ఐతే బావకి నాకు 15 సం|| తేడా అంతే …  
అంతేరా అన్నాయ్ కొత్త అల్లుడంటే అలాగే ఉంటుంది , మళ్ళీ ఇద్దరు కూర్చుని బాధపడటం మొదలుపెట్టారు .

ఎపుడైనా రామూ అడిగితే నూనె  మాలీష్ చేయరా అంటే పెద్దోరయ్యారు మీకెందుకు బాబు అనే రంగయ్య ,వద్దు వద్దంటున్నా అల్లుడిగారికి నూనె మాలీషులు చేసాడు.అంతా చూస్తూ ఉన్నాడు రాము. 
ఇది అంతం కాదురా ఆరంభం; 
చిన్న తమ్ముడు లచ్చి బాబు(లక్ష్మణుడు ) వచ్చి పక్కన కూర్చుని గంభీరంగా సెలవిచ్చాడుఆ ఏడిసావులే నోరుమూసుకో .

ఉదయం బాలభోగం పేరుతో దధ్యోజనం ఉంటుంది అదే టిఫ్ఫిను ..బ్రేకుఫాస్టు అనుకున్న వాళ్ళందరికి ఆశాభంగం కలిగిస్తూ ...ఇడ్లీ,వడా,దోశా కనిపించాయ్
ఓర్నాయనో ఇదేదో బాగా దారుణంగా ఉంది  అనుకున్నారు పిల్లలందరు .

హమ్మయ్య ఇంక అలా తిరిగొద్దాం అని బయలు దేరాడు రాజేష్ ,ఇంతలో పినమావగారు ఎదురొచ్చి ఒక్కరు ఏం వెళతారు ఆగండి అని ఒరేయ్ రామూ కాస్త బావ తో పాటు బయటకి వెళ్ళి ఊరంతా చూపించరా అని పిలిచాడు .నేనంటే నేనంటూ కొట్టుకుని ఆఖరికి రామ ,లక్ష్మణులిద్దరూ బావ గారికి ఊరు చూపిద్దామని బయలు దేరారు. దారిలో వాకిళ్ళలో ఉన్న రంగవల్లులూ  , భోగి మంటలు చూస్తూ దణ్ణాలు పెట్టుకుంటూ ఆ ఊరి రచ్చబండ దాకా వెళ్ళిన తర్వాత ,

అల్లుడు గారు ఎప్పుడొచ్చారు అంటూ అడిగాడు ఒక పెద్దాయన ,
ఎవర్నబ్బా అని అటు ఇటూ తలతిప్పాడు ,
మిమ్మల్నే బాబూ మీరు ఆ ఇంటికి అల్లుడంటే మా అందరికి అల్లుడుగారి కిందే లెఖ్ఖ అన్నాడు .
వెనక్కాల నుంచి బావమరుదులిద్దరు నోళ్ళు మూసుకుని నవ్వుకుంటున్నారు భలె భలె అనుకుంటూ .

కొంత ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న పూరింటి పైన పేద్ద ఆనపకాయ నవనవ లాడుతూ కనిపించింది .
ఒరేయ్ అది "సొరకాయ" కదూ అడిగాడు..
కాదు బావా "ఆనపకాయ" నవ్వాపుకుంటూ బదులిచ్చాడు .
ఏదయితేనేం కాని వాళ్ళిస్తారేమో కనుక్కో అన్నాడు ,
వెంటనే శీనూ శీనూ అంటూ లోపలికి దూరి ,అతనిని బయటకి తీసుకువచ్చాడు 
,వాడు మెలికలు తిరుగుతూ మొహమాట పడిపోతూ అయ్య బాబోయ్ అల్లుడు గారాండి,
ఏం కావాలండీ ఆనక్కాయ నేను పంపుతా మీరెళ్ళండి అంటూ తెగ మర్యాదలు చేసేసాడు.
మరి డబ్బులు అంటూ జేబులోంచి డబ్బులు తీయబోయాడు..
మంచోరే డబ్బులిత్తన్నారా ఇంకా నయం పెద్దయ్య గారికి తెలిసిందంటే నా తాట తీసేత్తారు ..మీరెళ్ళండి బాబూ మీరెళ్ళండి అంటూ సాగనంపాడు .

ఊరంతా తిరిగి తిరిగి ఇంటికొచ్చారు ...అరుగు మీదే కూర్చుని ఎదురుగా ఉన్న చెరువులో వాలిన కొంగలను చూస్తున్నాడు ..ఈలోగ ఒక జోలె లాంటిది పట్టుకుని చిన్న పిల్లలు పదిమంది వచ్చారు .

ఎప్పుడెప్పుడు పండగా ...ఏడాది పండగా ...
పండగెందుకొచ్చింది ...పప్పులు తిండానికొచ్చింది
కూతురెందుకొచ్చింది ...కుడుములు తిండానికొచ్చింది
అల్లుడెందుకొచ్చాడు ..అరిసెలు తిండానికొచ్చాడు .

ఆఖరి లైను మాత్రం మళ్ళీ మళ్ళి పాడసాగారు.ఏదో పరధ్యానం లో వింటున్న వాడు ...మళ్ళి మళ్ళి పాడేసరికి సరిగా విని పిల్లల కేసి చూసి నవ్వసాగాడు .
వాళ్ళు  మళ్ళీ  ఆ లైను వదిలి
వేసినోళ్ళకి  పుణ్యం ...వేయనోళ్ళకి పాపం
అంటూ పాడటం మొదలుపెట్టారు .ఇంతలో లోపలి నుంచి పిన్నత్తగారు వచ్చి బియ్యం ..ఇంకా ఏవేవో కూరగాయలు వాళ్ళ జోలెలో వేసి వెళ్ళిపోయింది .
అసలు ఎందుకు అలా వాళ్ళు పాడుకుంటూ జోలె పట్టుకుని వస్తున్నారు,  
అక్కడే ఉన్న రాగిణి ని అడిగాడు 
పాపం మనకైతే పండగలు పబ్బాలు ఉంటాయ్ బావ 'కాని మూగ జీవాలకి ఆ అవకాశం లేదు కదా 
అందుకే  పిల్లలంతా కలిసి  ఇలా సంపాదించి వండి Stray dogs కి పెడతారు అని చెప్పింది .
ఓహో ..
అయితే అయ్యిందిలె గాని వాళ్ళు నాకు అరిసెలు గురించి గుర్తు చేసారు అవి కూడా ఉంటే భలే ఉంటుంది అన్నాడు .
లోపలికి వెళ్ళి బావకి అరిసెలు కావాలిట అంటూ వాళ్ళమ్మ తో చెప్పింది .
అప్పటికప్పుడు అరిసెలంటే ఎలా. వెంటనే పక్క వీధిలో ఉండే వాళ్ళ అక్క కి ఫోను చేసి అరిసెలు సంగతి పురమాయించింది
మళ్ళీ గుర్తొచ్చి రాగిణి ని పిలిచి జున్ను దొరుకుతుందేమో కనుక్కో అన్నాడు
మళ్ళీ ఆ వార్త చేరవేసింది .
మళ్ళి వేరే ఊళ్ళొ ఉంటున్న తమ్ముడికి ఫోను చేసి ఎంత త్వరగా ఐతే అంత త్వరగా నువ్వు తెవల్సిందే అంటూ హడావుడి పెట్టేసింది .
మళ్ళీ వెళ్ళి కాసేపు  పడుకుందామా అనుకుంటుండగా డప్పు వాయించుకుంటూ ఒకడు వచ్చి నిల్చున్నాడు
వెనుకే గరగను నెత్తిమీద పెట్టుకుని (ఇత్తడి బిందెలాంటి దానిపైన సర్పం ఆకారమ్లో చీరలతో కప్పి ఉంటుంది ) ,కాళ్ళకి మువ్వలు కట్టుకుని ఘల్లు ఘల్లు మనుకుంటూ వచ్చాడు
లచ్చిబాబు ,రాగిణి లోపలనుంచి ఇద్దరూ కొట్టుకుంటూ వచ్చి వాళ్ళచేతిలో ఉన్న పసుపు నీళ్ళు  చెంబుతో సహా అతని కాళ్ళ మీద పడేసారు ,
రజని తన చేతిలో ఉన్న బియ్యం ప్లేటు అతని చేతికి అందించింది . తన దగ్గర ఉన్న పసుపు , వేపాకు ఆ ప్లేటు లో పెట్టి మళ్ళీ ఘల్లు ఘల్లు మని కుంటు కుంటూ వెళ్ళిపోయాడు .
ఏమిటిది అని అడిగేలోపే ..  
పంటలు బాగా పండిన ఏడాది గ్రామ దేవతకి  జాతర చేస్తారు ఆ విధంగా రక రకాల ఆటగాళ్ళకి ,పాటగాళ్ళకి ,వేషాల వాళ్ళకి కూడా పని దొరుకుతుందని అని చెప్పింది రాగిణి . ఇంకో రెండు రోజులలో జాతర జరుగుతుంది .
ఇవన్నీ నీకెవరు చెప్పారు తల్లి  
ఇంకెవరు మా పెద్దనాన్న అని తుర్రుమని లోపలికి పారిపోయింది .

దేవుడికి పెట్టేసావు కదా నువ్వు మాకు అన్నం పెట్టవు ఏంటమ్మా ఇది   
లచ్చి బాబు గోల చేయడం మొదలు పెట్టాడు .
పోనిలే పిన్ని,పాపం పిల్లలకి పెట్టేయొచ్చు కదా అంది రజని .
ఇంకా నయం అల్లుడికి పెట్టకుండా తినకూడదు తప్పు అంటూ లెంపలే్సుకుంది.

ఒరేయ్ లచ్చి ,రాగిణి ,రాము ఇలా రండిరా పెద్దనాన్న పిలిచాడు వాళ్ళందరిని ఆయన చేతిలో దొంగతనంగా వంట గదిలోంచి తీసుకొచ్చిన అరిసెలు ఉన్నాయ్ ..
మెల్లగా ఎవరికి తెలియకుండా తినేసి రండి అని ,ముఖ్యంగా మీ పెద్దమ్మకి తెలియకూడదు ...
అని,అక్కడి నుంచి త్వరత్వర గా వెళ్ళిపోయాడు .

ఆదరాబాదరా జున్ను తీసుకుని పక్క ఊరినుంచి రాగిణి మేనమమ కూడా వచ్చాడు .
చూడవే మావయ్య ఒక్కసారి కూడా జున్ను తే మావయ్యా అంటే తేడు 
ఈ రోజు చూడు బావ కోసం "helicopter వేసుకుని వచ్చాడు అన్నాడు రాము ,రాగిణితో..
అంతా చూస్తున్నాలే కాని ముందు నువ్వు మూతి తుడుచుకో పెద్దమ్మ చూసిందంటే పెద్దనాన్న గతి ఇంతే ...

అందరూ భోజనాలకి కూర్చున్నారు ..అల్లుడుగారికి ఒక్కసారిగా ఎస్.వి .రంగారావు గారు గుర్తొచ్చారు .ఆయన మాయాబాజార్ లో తిన్నపదార్ధాలు కనిపిస్తున్నాయ్ కళ్ళముందు .ఇతనడిగిన లిస్టుతో కలిపి చాలా ఉన్నాయ్వద్దు మొర్రో అంటున్నా ఇది మీరడిగినవే ...ఇది మీరు ఊరికొచ్చేముందు చెప్పినవే అంటూ బలవంతాన మావ గారు ,పిన మావగార్లు అందరూ కలిసి తినిపించేసారు .ఎట్టకేలకి భోజనమయింది .హమ్మా హబ్బా అనుకుంటూ లేచాడు .


తాంబూలం తీసుకొచ్చి ఇచ్చింది భార్యామణి నవ్వాపుకుంటూ..
ఏం వేళాకోళంగా ఉందా ...అసలు పొట్టలో ఖాళీ ఎక్కడుందే తాంబూలం వేసుకొవడానికి అని కసిరి భారంగా నడచుకుంటూ వెళ్ళాడు ….
అప్పుడు గుర్తొచ్చింది ,వాళ్ళ స్నేహితుడు ...అదే ఊరికి మరో అల్లుడు అయిన రమేష్ అన్న మాటలు 
" ఒరేయ్ పొరపాటున నోరు జారి ఇది కావాలి అది కావాలి అని అడగకు తర్వాత వద్దు మొర్రో అన్నా వినరు  అసలే ఆ ఊరివాళ్ళు మర్యాదలకి పెట్టింది పేరు రా "... ...
ఓరి దేవుడా వాడి మాట పట్టించుకోలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటు వట్టి నేల మీదే పడుకుని దొర్లడం మొదలు పెట్టాడు .
అల్లుడి గారి వింత ప్రవర్తన చూసి బుగ్గలు నొక్కుకున్నారు అత్తలందరూ...
ఏమే మీ ఆయనకి ఏమన్నా పైత్యం ...చిత్త చాంచల్యం లాంటివి ఉన్నాయా అని రజని ని పిలిచి అతనిని చూపిస్తూ అడిగారు ...
ఒక్క నవ్వు నవ్వి ..లేదమ్మ మీ మర్యాదలకి ఆనందం తో తట్టుకోలేకా అలా దొర్లుతున్నారు …....
ఆ ఆ ఆ  :-\ .......
ఇంక పిల్లల సంగతి సరే సరి బావ గారు బాధతో దొర్లితే ...వీళ్ళు ఆనందం తో దొర్ల సాగారు ....











13 comments:

  1. చక్కగా ఉంది వదినా కధ..
    నాకు ఈనాడు ఆదివారం పుస్తకం లో కధలు గుర్తువస్తున్నాయి.అంత కమ్మగా ఉన్నాయి నీ కధలు.

    ReplyDelete
  2. చాలా చాలా చాలా కమ్మగా ఉంది ....

    ReplyDelete
  3. అబ్బాబ్బబ్బబ్బా ఎంత బాగుందో! అచ్చమయిన కోనసీమ పల్లెటూరు గుర్తొచ్చింది! పనసపొట్టుకి అక్కడే బాగా ప్రసిద్ధి కదా!

    ReplyDelete
  4. మన కోనసీమ అల్లుళ్ళ మర్యాదలు బాగా వ్రాశావు ప్రియ .
    చదివినంత సేపు మా ఇంట్లో ఆ సన్నివేశాలన్నీ మా ఇంట్లో ఎప్పుడు మా వాళ్ళు క్రొత్త అల్లుళ్ళు వస్తే ఏదో పెద్ద ఇండియా ప్రెసిడెంట్ వచ్చినంతగా చేసే హడావిడి గుర్తు వస్తూనే ఉంది .
    అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళు తిన్నారా అని కుడా చూడకుండా అల్లుడు ఎక్కడ అలిగేస్తాడో అని తెగ హైరానా పడిపోతారు . నిజంగా చాలా చక్కగా కోనసీమ మర్యాదలు చెప్పావు .

    ReplyDelete
  5. చాలా బావుందండీ. కానీ ఇప్పటి కాలంలో ఉన్నాయా ఇంకా ఆ ఊళ్ళూ, కుటుంబాలూ, మర్యాదలూ?

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ఉన్నాయ్ ....ఒక్కసారి కోనసీమ వైపు వెళ్ళి చూడండి

    ReplyDelete
  8. hahaha.. vadina.. awesome undi... chinna doubt.... idi mee katha e na??? rajesh place lo anna, ragini palce lo nuvu na????

    ReplyDelete
  9. Very good one Vishnu..

    ReplyDelete